'ఈఎంకే' షో చేయలేనని చెప్పిన తారక్.. షాక్ లో నిర్వాహకులు!
on Oct 25, 2021
'బిగ్ బాస్' షోతో బుల్లితెర ప్రేక్షకులను మెప్పించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోతో మరోసారి ప్రేక్షకులను అలరిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ మొదటి సీజన్ కు హోస్ట్ గా చేసిన తారక్.. ఆ తర్వాత సీజన్లకు హోస్ట్ చేయలేదు. ఇప్పుడు 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో విషయంలోనూ తారక్ అదే రిపీట్ చేయబోతున్నారని న్యూస్ వినిపిస్తోంది.
'బిగ్ బాస్' షో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వడానికి ప్రధాన కారణం తారక్ అనే చెప్పొచ్చు. తన టాకింగ్ పవర్, కామెడీ టైమింగ్ తో షోని గ్రాండ్ సక్సెస్ చేశారు. అయితే ఊహించని విధంగా తర్వాత సీజన్లకు తారక్ హోస్ట్ గా వ్యవహరించలేదు. దీంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఇక ఇప్పుడు 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో విషయంలోనూ తారక్ అదే రిపీట్ చేయనున్నారని తెలుస్తోంది. 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోతో హోస్ట్ గా రీఎంట్రీ ఇచ్చిన తారక్ మరోసారి తనదైన శైలిలో అలరిస్తున్నారు. అయితే హోస్ట్ గా తారక్ కి మరోసారి ఫుల్ మార్క్స్ పడినా.. షోకి ఆశించినస్థాయిలో రేటింగ్స్ రావడంలేదని అంటున్నారు. అసలే రేటింగ్ విషయంలో కాస్త నిరాశలో ఉన్న షో నిర్వాహకులకు తారక్ ఊహించని షాక్ ఇచ్చారని వార్తలొస్తున్నాయి.
ఇప్పటికే 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో ఈ సీజన్ కి సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేసిన తారక్.. ఇక మీదట ఈ షోని తాను చేయలేనని చెప్పారట. దీంతో నిర్వాహకులు తారక్ ని ఒప్పించే పనిలో ఉన్నారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.
Also Read